యువ సాధకుల సంగమం

(రాంచీ ఆశ్రమం)

బుధవారం, 10 సెప్టెంబర్, 2025 – ఆదివారం, 14 సెప్టెంబర్, 2025

నమోదు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమయ్యింది!

కార్యక్రమం గురించి

మనస్సు మరియు భావాలను లోపలికి మళ్లించినప్పుడు, దేవుని పరమానందాన్ని మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. ఇంద్రియ సుఖాలు శాశ్వతం కాదు, భగవంతుని ఆనందం శాశ్వతమైనది. అది సాటి లేనిది!

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఒక నూతన కార్యక్రమం వికసిస్తోంది

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యువ సాధకుల (23-35 సంవత్సరాల వయస్సు) కోసం ప్రత్యేకంగా సాధనా సంగమాన్ని అందిస్తోంది — సెప్టెంబరు 10 నుండి 14, 2025 వరకు ప్రశాంతమైన వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో నిర్వహించబడే ఈ సంగమం, ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యే అనుభూతిని కలిగిస్తుంది. తొలిసారిగా నిర్వహించబడే ఈ కార్యక్రమ వివరాలు మేము చాలా సంతోషంతో పంచుకోవాలనుకుంటున్నాము.

ఆంతరిక స్పష్టతను, శక్తిని చేకూర్చే పరమహంస యోగానందగారి సార్వత్రిక బోధనలపై యువతలో పెరుగుతున్న ఆసక్తికి ఈ ప్రత్యేక సంగమం ఒక అభివ్యక్తి.

భారతదేశమంతటి నుండి వందలాది మంది యువభక్తులు కలుసుకుని పరమహంస యోగానందగారి బోధనలను లోతుగా అధ్యయనం చేయడానికి, దివ్యమైన స్నేహాలను ఏర్పరచుకోవడానికి మరియు వేగవంతమైన ఆధునిక ప్రపంచానికి సరిపోయే సమతుల్య ఆధ్యాత్మిక జీవనశైలిని కనుగొనే ఒక పవిత్ర అవకాశాన్ని ఈ సంగమం అందిస్తుంది.

జీవితంలో యోగ విధానాన్ని పెంపొందించుకునే ఒక ఆధ్యాత్మిక దినచర్య

యోగానందగారి సంతులిత జీవన ఆదర్శంలో పాదుకున్నట్లుగా, సంగమ సమయంలో దైనందిన దినచర్య సరళంగా ఉంటుంది, అదే సమయంలో పరివర్తనకారకంగా ఉంటుంది: ధ్యానాలు, కీర్తనలు, ఆకర్షణీయ తరగతులు మరియు వర్క్‌షాప్‌లు, ఆనందకరమైన సేవ, స్ఫూర్తిదాయకమైన సత్సంగాలు, వై.ఎస్.ఎస్. పాఠాల అధ్యయనం, ఆత్మపరిశీలన మరియు విశ్రాంతి, వినోదం మరియు సహవాసం కోసం సమయం ఉంటాయి.

ఈ సంపూర్ణ యోగా జీవనశైలి ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడింది మరియు యువ అన్వేషకుల కోసం రూపొందించబడింది — వారు ఇంటికి తీసుకువెళ్లి, వారి స్వంతం చేసుకొనగలిగేటటు వంటిది.

సంగమంలోని ముఖ్యాంశాలు

ముఖ్యంగా యువ అన్వేషకుల కోసం ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై సమీక్ష మరియు మార్గదర్శక అభ్యాసాన్ని కలిగి ఉండగా, నూతన అంశాలు కూడా పరిచయం చేయబడతాయి. ఈ కార్యక్రమం క్రింది అంశాలతో కూడి ఉంటుంది:

  • సామూహిక ధ్యానాలు మరియు కీర్తనలు
  • పవిత్రమైన వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల సమీక్ష మరియు నిర్దేశిత అభ్యాసం
  • పాఠాల సామూహిక అధ్యయనం మరియు ఆత్మపరిశీలన
  • గురుదేవుల బోధనలు మరియు వాటిని దైనందిన జీవితంలో ఆచరించేందుకు స్ఫూర్తిదాయకమైన సత్సంగాలు
  • వర్క్‌షాప్‌లు మరియు సామూహిక చర్చా కార్యక్రమాలు
    • ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం
    • వేగవంతమైన ప్రపంచంలో ఆంతరిక సమతుల్యతను కనుగొనడం
    • దయ మరియు పరిశీలనతో సంబంధాలను పెంపొందించుకోవడం
    • సఫలత పొందగలిగే సూత్రాన్ని వర్తింపజేయడం
  • రాంచీకి సమీపంలోని ప్రకృతి ప్రదేశానికి విహారయాత్ర
  • హఠ యోగా సమావేశాలు, క్రీడలు మొదలైన వినోద కార్యకలాపాలు
  • ఇతర యువ సాధకులతో సహవాసం
కార్యక్రమం వివరాలు

తరగతులు మరియు ఉపన్యాసాలు ఆంగ్లంలో ఉంటాయి.

క్రియాయోగ దీక్షా వేడుక లేనప్పటికీ, క్రియాయోగ ప్రక్రియపై ఒక సమీక్ష ఉంటుంది.

కార్యక్రమాల తేదీ సమీపిస్తునప్పుడు పూర్తి వివరాలతో కూడిన జాబితా అందుబాటులో ఉంచబడుతుంది. కార్యక్రమం ప్రారంభమయ్యే రెండు వారాల ముందు దయచేసి ఈ విభాగాన్ని వీక్షించండి.

నమోదు

సంగమం కోసం నమోదు ఇప్పుడు 23 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వైఎస్ఎస్ భక్తులకు ప్రారంభమయ్యింది. మీ వయస్సు ఈ పరిధికి కొద్దిగా ఎక్కువ లేక తక్కువ ఉన్నప్పటికీ, హృదయపూర్వకంగా పాల్గొనాలనే ఆసక్తి ఉంటే, మార్గదర్శకత్వం కోసం వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం ను సంప్రదించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

నమోదు రుసుము ఒక్కొక్కరికి ₹2500/-. ఈ రుసుము భోజన ఛార్జీలతో కలిపి ఉంటుంది. నమోదు రుసుము చెల్లించడం మీకు కష్టంగా అనిపిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

అదనపు వివరాలు:

  • నమోదు, మొదట చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికపై ఉంటుంది.
  • సంగమానికి కేవలం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే హాజరు కాగలరు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ఆహ్వానం ఉన్నప్పటికీ, సమీపంలోని హోటళ్లలో తమ బసను వారే ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి హోటళ్ల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
  • కార్యక్రమం నిరంతరాయమైన జాబితాను కలిగి ఉన్నందున, బలహీనమైన ఆరోగ్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దరఖాస్తు చేయవద్దని సూచిస్తున్నాం.

నమోదు సమాచారం

నమోదు ఇప్పుడు ప్రారంభంయ్యింది!

నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాల సమాచారం క్రింది విధంగా ఉంది:

డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ నమోదు:

త్వరగా మరియు సులభంగా నమోదు చేయడానికి, దయచేసి దిగువ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి.

సహాయక కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నమోదు:

రాంచీ ఆశ్రమం సహాయ కేంద్రానికి దయచేసి కాల్ చేయండి (0651 6655 555) లేదా ఈ-మెయిల్ ద్వారా ఈ కింది వివరాలను అందించండి:

  • మీ పూర్తి పేరు
  • వయస్సు
  • చిరునామా
  • ఈ-మెయిల్ మరియు టెలిఫోన్ నంబర్
  • వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేదా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
  • ప్రతిపాదిత రాక మరియు నిష్క్రమణ తేదీలు.

మీ మొబైల్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపబడే చెల్లింపు లింక్‌ ద్వారా రుసుము మొత్తాన్ని మీరు చెల్లించవచ్చు.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల నమోదు కోసం:

  • ఆసక్తి గల ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ఈ-మెయిల్ ద్వారా వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించి, పైన పేర్కొన్న అన్ని వివరాలను అందించవలసి ఉంటుంది.
  • కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ఆహ్వానితులు. అలాగే, వారు వారి భోజనాలను కార్యక్రమ ప్రాంగణంలోనే చేయవచ్చు. కాని, వారి వసతి మాత్రం, సమీపంలోని హోటళ్లలో స్వంతంగా ఏర్పాటు చేసుకోగలరని అభ్యర్ధిస్తున్నాం. అటువంటి హోటళ్ల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.

దయచేసి గమనించండి:

  • మీ నమోదు ధృవీకరించబడినప్పటికీ, మీరు హాజరు కాలేకపోతే, నమోదు రుసుము తిరిగి చెల్లించబడదు లేదా మరొక వ్యక్తికి బదిలీ చేయబడదు.
  • నమోదు విజయవంతమయ్యాక, మీరు ఈ-మెయిల్ లేదా వాట్సప్ లేదా ఎస్.ఎం.ఎస్. ద్వారా ధృవీకరణను అందుకుంటారు. మీకు అలాంటి నోటిఫికేషన్ రాకుంటే, దయచేసి ఫోన్ ద్వారా వై.ఎస్.ఎస్. రాంచీ సహాయక కేంద్రాన్ని సంప్రదించండి (0651 6655 555) లేదా ఈ-మెయిల్ (helpdesk@yssi.org) చేయండి.
మీ సందర్శనకు ఏర్పాటు చేసుకోండి

కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నానికి ముగుస్తుంది. పాల్గొనేవారు మంగళవారం నాటికి చేరుకోవాలని విన్నవిస్తున్నాం. అయినప్పటికీ, అందరు రెండు రోజుల ముందుగానే వచ్చేందుకు మరియు కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక రోజు అదనంగా ఉండేందుకు ఆహ్వానిస్తున్నాం.

ఉమ్మడి వసతి స్త్రీలు మరియు పురుషులకు విడిగా ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబ సభ్యులు తదనుగుణంగా తమ సామగ్రిని తెచ్చుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.

పాల్గొనేవారందరూ ఆశ్రమ ప్రాంగణంలోనే ఉండమని ప్రోత్సహిస్తున్నాం. అయితే, ప్రత్యేక వసతి లేదా ఆహార అవసరాలు ఉన్న భక్తులు, దయచేసి వారి స్వంత ఏర్పాట్లు చేసుకోగలరు. సమీపంలోని హోటళ్ల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.

స్వచ్ఛంద సేవ & సేవా అవకాశాలు

గతంలో మాదిరిగానే, నమోదు, వసతి, ఆడియో-విజువల్స్, భోజన వసతి, పరిశుభ్రత, అషరింగ్ మరియు ఇతర విభాగాల్లో సేవలందించేందుకు భక్తులు-వాలంటీర్లు అవసరమవుతారు. ఈ విభాగాలు కొన్నింటిలో కార్యక్రమం ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు స్వచ్ఛంద సేవకులు రావాల్సి ఉంటుంది.

మీరు మీ సేవను అందించడానికి ప్రేరణ పొందినట్లయితే, దయచేసి మీ నమోదు దరఖాస్తును పూరించే సమయంలో మీ ఆసక్తిని సూచించండి.

మీరు అందించే ఆర్థిక మద్దతు ప్రశంసనీయం

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికయ్యే వివిధ ఖర్చులను పూరించడానికి మేము మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాము. పరిమితమైన స్తోమత ఉన్న భక్తులు కూడా పాల్గొనేందుకు వీలుగా నమోదు రుసుము రాయితీతో కూడి ఉంది. ఈ రాయితీని అందించడానికి మరియు తద్ద్వారా గురుదేవుల ఆతిథ్యాన్ని చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ విస్తరింపజేసేందుకు మాకు వీలు కలిగిస్తూ, పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వగలిగిన వారికి మేము కృతజ్ఞులమై ఉంటాం.

నమోదు మరియు విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథం
రాంచీ 834 001

ఫోన్: (0651) 6655 555 (సోమ-శని, ఉ. 9:30 నుండి సా. 4:30 గంటల వరకు)
ఈ-మెయిల్: helpdesk@yssi.org

యువత కోసం మేము చేస్తున్న కార్యక్రమాల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సంప్రదించండి youthservices@yssi.org.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి