150 సంవత్సరాల క్రియాయోగం

క్రియాయోగం పునరుద్ధరణ యొక్క 150వ వార్షికోత్సవం

మహావతార్ బాబాజీ
మహావతార్ బాబాజీ
లాహిరీ మహాశయ
లాహిరీ మహాశయ
స్వామి శ్రీ యుక్తేశ్వర్
స్వామి శ్రీయుక్తేశ్వర్
పరమహంస యోగానంద
పరమహంస యోగానంద

“దైవసాక్షాత్కారసిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాలమధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”

— మహావతార్ బాబాజీ

ఆధునిక ప్రపంచానికి ఆధ్యాత్మిక పంపిణీ

హిమాలయాల్లోని రాణిఖేట్‌కు సమీపంలో ఉన్న మరణం లేని గురువు మహావతార్ బాబాజీతో లాహిరీ మహాశయుల మొదటి సమావేశం మరియు క్రియాయోగం యొక్క పవిత్ర శాస్త్రంలో వారి దీక్ష యొక్క 150వ వార్షికోత్సవం, 2011వ సంవత్సరంలో జరుపబడింది.

సెల్ఫ్-రియాలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు పరమహంస యోగానందగారు, ఈ అలౌకికమైన ఆశీర్వాదాన్ని వారి “ఒక యోగి ఆత్మకథ” ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు, అందులో వారు ఇలా అన్నారు:

“ఈ శుభ సంఘటన జరిగింది లాహిరీ మహాశయుల కొక్కరికే కాదు; మానవజాతి కంతటికీ సౌభాగ్య సమయమది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగవిద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణమది.”

“ఈ పంధొమ్మిదో శతాబ్దంలో నేను నీద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్నివేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ క్రీస్తుకూ సెయింట్ జాన్ కూ సెయింట్ పాల్ కూ తదితర శిష్యులకూ తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే,” అన్నారు బాబాజీ.

“సమాజ సామాన్యానికి తెలియకుండానే, కాశీలో ఒక మారుమూల, 1861లో, మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభమయింది. పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు; అలాగే, ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజసిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్తభ్రమరాలు, ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలో ప్రతిభాగం నుంచీ రావడం మొదలుపెట్టాయి.”

“పురాణ కథలో దాహాతురుడైన భగీరథుడనే భక్తుడికోసం గంగ, ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలనందించినట్టు, 1861లో క్రియాయోగమనే స్వర్గంగ, హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది.”

మహావతార్ బాబాజీ మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్‌ల ఆదేశానుసారం, పరమహంస యోగానందగారి ద్వారా ప్రారంభించబడిన సంస్థ కృషితో ఈ అలౌకికమైన నది ఈనాటికీ ప్రవహిస్తూనే ఉంది. పరమహంస యోగానందగారు వ్యక్తిగతంగా 1,00,000 మంది శిష్యులకు క్రియాయోగం యొక్క పవిత్ర శాస్త్ర దీక్షను ఇచ్చారు మరియు ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) యొక్క సాధన పద్ధతుల ద్వారా ఇంకా అనేక వేల మంది ఈ క్రియాయోగం దీక్షను స్వీకరించారు. మహావతార్ బాబాజీగారు వారికి అప్పగించిన లక్ష్యం ఏమిటంటే, క్రియాయోగం అభ్యాసం ద్వారా అన్ని మతాలకు అంతర్లీనంగా ఉన్న ఏకైక భగవంతుని యొక్క ప్రత్యక్ష వ్యక్తిగత అనుభవాన్ని సాధించడం, అందరికీ సహాయం చేయడం, తద్ద్వారా ప్రపంచ కుటుంబాన్ని ఏకత్వం మరియు దివ్య బంధుత్వం యొక్క ఆధ్యాత్మిక బంధాలలో ఏకం చేయడం.

1861లో ఆ దీవెనకరమైన క్షణం మానవజాతిలో ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యం యొక్క దృష్టిని మేల్కొల్పడానికి ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని ప్రారంభించింది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులు తమ విశ్వాసపాత్రమైన క్రియాయోగం సాధన ద్వారా “భగవంతుని సహవాసము” మరియు “భగవదానందము” అనే దివ్యమైన అమృతాన్ని అనుభూతి చెందుతున్నారు. బాబాజీ చాలా కాలం క్రితమే ఊహించినట్లుగా, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థల ద్వారా క్రియాయోగం అన్ని దేశాల్లోకి వ్యాపిస్తోంది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా సన్యాసుల పర్యటనలు, క్రియాయోగం దీక్షలు, కాన్వకేషన్ (USA), శరద్ సంగమం (భారతదేశం) మరియు ప్రపంచంలోని వారి అనేక కేంద్రాలు మరియు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా జరుపుకుంది. దయచేసి మరింత సమాచారం కోసం మీ స్థానిక కేంద్రం లేదా ఆలయాన్ని సంప్రదించండి.

పరమహంస యోగానందగారు వారి “ఒక యోగి ఆత్మకథ” ను భవిష్యత్ ఆశీర్వాదమైన ఈ ఆశీజనక పదాలతో ముగించారు: “ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలయింది. మానవ దైన్యాన్ని అంతనూ జయించడానికి నిర్దిష్టమైన, శాస్త్రీయమైన ఆత్మసాక్షాత్కారసాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి!”

క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఒక యోగి ఆత్మకథ  పుస్తకాన్ని చదవండి

Autobiography of a Yogi book cover

ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి

అనేక భాషలలో అందుబాటులో ఉంది

ఇతరులతో పంచుకోండి