అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగా ధ్యానం యొక్క ప్రాచీన ప్రక్రియలను సత్యాన్వేషకులకు పరిచయం చేయడానికి ఆయన జీవితం అంకితమైనందున, ప్రపంచం ఇప్పుడు యోగం యొక్క తత్త్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నదని తెలుసుకున్నప్పుడు పరమహంసగారు ఎంతో సంతోషిస్తారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యోగాపై ప్రస్తుత ప్రపంచం చూపుతున్న ఆసక్తి, వంద సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారు భారతదేశం నుండి అమెరికాకు అందించిన బోధనల పర్యవసానమే. “అంతర్జాతీయ యోగా దినం జరపాలన్న భారతదేశపు ఆలోచనకు ఐక్యరాజ్యసమితిలో సులభంగా ఆమోదం లభించిందంటే, అమెరికాలో భారతదేశపు ప్రప్రథమ గురువు అయిన శ్రీ పరమహంస యోగానందగారికే ఆ ఖ్యాతి దక్కుతుంది. నూరు సంవత్సరాల క్రితం అమెరికాలో యోగానికి పునాదిరాయి వేయడంలో ఆయన ఒక బృహత్ పాత్ర పోషించారు,” అని ఒక ఆన్లైన్ సమాచార పత్రిక వెల్లడించింది.
అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగ అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను సాధిస్తారు. ఇంకా, యోగ అనేది ఈ దివ్య అనుసంధానికి దారితీసే ఏదైనా ఒక చర్యను సూచిస్తుంది.”
ఈ కార్యక్రమాల గురించి
జీవితంలోని రోజువారీ సవాళ్ల మధ్య మనం చెక్కుచెదరని శాంతిని, ఆంతరంగిక ప్రశాంతతను ఎలా సాధించి, నిలుపుకోగలం? అన్ని పరిస్థితుల్లోనూ ఆంతరంగిక సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో సత్యాన్వేషకులు తెలుసుకొనేందుకు సహాయపడడానికి యోగ-ధ్యానంపై ప్రత్యేకంగా రూపొందించబడిన స్ఫూర్తిదాయక పరిచయ కార్యక్రమాల కోసం మాతో కలిసి పాల్గొనండి.
పరమహంస యోగానంద గారి సనాతన క్రియాయోగ బోధనలపై ఆధారితమైన ఈ ఆన్లైన్ కార్యక్రమాలు, యోగం, ఏ విధంగా ప్రగాఢ పరివర్తనను కలిగించే దివ్యశాంతి యొక్క అనుభూతికి దారితీసి, మనల్ని మరింత మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి సహాయపడగలదో వెల్లడిస్తాయి.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సన్యాసులు నిర్వహించే ఈ కార్యక్రమాలు, శాస్త్రీయమైన ఆధ్యాత్మిక బోధనల యొక్క సంక్షిప్త పరిచయాన్ని, దాని తరువాత, మీ మనస్సుకు ప్రగాఢశాంతిలో స్థిరంగా నిలపడానికి సహాయం చేసే ఒక నిర్దేశిత ధ్యానాన్ని కలిగి ఉంటాయి. ఈ నిర్దేశిత ధ్యానం, సరియైన ఆసనం యొక్క మౌలిక సూత్రాలను, ప్రాథమిక శ్వాస ప్రక్రియలను, దివ్య సంకల్పాలను మరియు మానసిక చిత్రణా ప్రక్రియలను కూడి ఉంటుంది.
ఈ కార్యక్రమాలలో పాల్గొని, ప్రయోజనం పొందడానికి మీ స్నేహితులను, అలాగే యోగాధ్యానంపై ఆసక్తి ఉన్నవారినందరినీ ఆహ్వానించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.
ప్రధాన కార్యక్రమం
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
శనివారం, జూన్ 13, 2026
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి కేదారానంద గిరి నిర్వహించే ఈ కార్యక్రమం వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం నుండి ప్రసారమవుతుంది; ఆ తరువాత వీక్షించడానికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
అన్ని ఆన్లైన్ కార్యక్రమాలు
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
శనివారం, జూన్ 13, 2026
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి శ్రేయానంద గిరి నిర్వహించే ఈ కార్యక్రమం వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం నుండి ప్రసారమవుతుంది; ఆ తరువాత వీక్షించడానికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
శనివారం, జూన్ 13, 2026
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి కేదారానంద గిరి నిర్వహించే ఈ కార్యక్రమం వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం నుండి ప్రసారమవుతుంది; ఆ తరువాత వీక్షించడానికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
శనివారం, జూన్ 13, 2026
సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి ప్రసారం కానున్న ఈ కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి ఆద్యానంద గిరి నిర్వహిస్తారు; ఆ తర్వాత కూడా వీక్షించడానికి ఇది అందుబాటులో ఉంటుంది.
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
ఆదివారం, జూన్ 14, 2026
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం నుండి ప్రసారం కానున్న ఈ కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి ఈశ్వరానంద గిరి నిర్వహిస్తారు, ఆ తర్వాత కూడా వీక్షించడానికి ఇది అందుబాటులో ఉంటుంది.
“యోగ-ధ్యానం ద్వారా శాంతిని అనుభూతిచెందండి”
(కార్యక్రమంలో నిర్దేశిత ధ్యానం కూడా కూడి ఉంటుంది)
ఆదివారం, జూన్ 14, 2026
సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం)
వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి శుద్ధానంద గిరి నిర్వహించే ఈ కార్యక్రమం వై.ఎస్.ఎస్. చెన్నై కేంద్రం నుండి ప్రసారమవుతుంది; ఆ తరువాత వీక్షించడానికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు
ఈ ఆన్లైన్ కార్యక్రమాలతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వై.ఎస్.ఎస్. కేంద్రాలు, మండళ్ళలో కూడా వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలు మరియు వీటికి సంబంధించిన సమాచారం కోసం, ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయండి:
ఒక యోగి ఆత్మకథ పై ప్రత్యేక ఆఫర్లు
ఈ సందర్భంగా ఒక యోగి ఆత్మకథ పుస్తకం యొక్కఈ-బుక్ ప్రతులను (ఇంగ్లీష్ మరియు అనేక ఇతర భాషలలో) ఉచితంగా అందిస్తున్నాము. అంతే కాకుండా, ఈ ఆధ్యాత్మిక మహాకావ్యం యొక్క ముద్రిత ప్రతులన్నీ కూడా 25% తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం, ఈ కింది విభాగాలను చూడండి.

ఒక యోగి ఆత్మకథ
ఈ-బుక్ ను ఉచితంగా పొందండి
తగ్గింపు చెల్లుబాటు తేదీ:
జూన్ 22, 2026
తగ్గింపు చెల్లుబాటు తేదీ:
జూన్ 22, 2026
శ్రీ పరమహంస యోగానంద గురించి
తన సమగ్రమైన బోధనలతో శ్రీ పరమహంస యోగానందగారు లక్షలాది మంది జీవితాలపై గాఢమైన ప్రభావం చూపించారు. “పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా” విశేషంగా గౌరవించబడుతున్న పరమహంసగారు శాస్త్రీయ ప్రాణాయామ (ప్రాణశక్తి నియంత్రణ) ప్రక్రియలు కలిగి ఉన్న బోధనలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఆద్యుడు. తాను సర్వజ్ఞుడినని, సర్వవ్యాపకుడైన ఆత్మనని గ్రహించడమే యోగా యొక్క అత్యున్నత లక్ష్యం. శ్రీ యోగానందగారి కార్య ప్రణాళిక — యోగదా సత్సంగ పాఠాలలో వివరించబడింది — మతంలో అంతర్లీనంగా ఉండే మూలాలకు ఆచరణాత్మక మార్గాన్ని సమకూరుస్తుంది. మరియు ఇది మరింత ఎక్కువ మంది జనులను ఆకర్షించే ఒక వ్యవస్థ: ఇది హఠ యోగం యొక్క భౌతిక ప్రయోజనాలపై మాత్రమే కాకుండా, మానసిక సామర్థ్యాలను మరియు ఆన్నిటినీ మించి తమ ఆధ్యాత్మిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రణాళికను అందిస్తుంది.
ఆయన బోధించిన బోధనలు మరియు ధ్యాన ప్రక్రియలు ఇప్పుడు వీటి ద్వారా అందుబాటులో ఉన్నాయి:
- యోగదా సత్సంగ పాఠాలు, శ్రీ యోగానందగారు స్వయంగా రూపొందించిన ఒక సమగ్ర గృహ అధ్యయన శ్రేణి. ఇవి డిజిటల్ యాప్ రూపంలో కూడా లభిస్తాయి
- తన బోధనలను విశ్వమంతా వ్యాప్తి చేయడానికి ఆయన స్థాపించిన సంస్థ వై.ఎస్.ఎస్. నుండి పుస్తకాలు, రికార్డింగులు, మరియు ఇతర ప్రచురణలు
- యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకి చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. సన్యాసులు నిర్వహించే పర్యటనలలో వారు శక్తిపూరణ, ఏకాగ్రత, మరియు ధ్యానం వంటి శాస్త్రీయ యోగప్రక్రియల గురించి వివరిస్తారు
- సన్యాసులు నిర్వహించే ఏకాంత ధ్యాన వాసాలు
- సాధనా సంగమాలు
- బాలల కోసం ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనంపై కార్యక్రమాలు
ఇతరులు ఏమన్నారు
"1935లో నేను శ్రీ పరమహంస యోగానందగారిని కలకత్తాలో కలిశాను. అప్పటి నుండి అమెరికాలో వారు చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుంటున్నాను. ప్రపంచములో యోగానందగారి సన్నిధి చిమ్మచీకటిలో గొప్ప తేజోవంతమైన వెలుగులాంటిది. నిజమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అరుదుగా అటువంటి మహాత్ముడు భూమిపై అవతరిస్తాడు."
“ప్రపంచం నలుమూలల ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలు యోగానందగారి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఆ కేంద్రాలు సర్వతోముఖవ్యాప్తి చెందుతాయి; అవి గొప్ప ఆధ్యాత్మిక అయస్కాంత వలయముగా ఏర్పడి ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలనందిస్తాయి.”
“శ్రీ శ్రీ పరమహంస స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలలో సర్వోన్నత ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, సేవ మొదలైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.”
“ఈ పుస్తకము నాకు చాలా ఇష్టమైనది. తమ ఆలోచనలు మరియు భావజాలాలను సవాలు చేయగలిగే ధైర్యం ఉన్న వారందరు దీనిని తప్పక చదవాలి. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే, మీ జీవితం మరియు దృక్పథం పూర్తిగా మారిపోతాయి. దైవం మీద నమ్మకం ఉంచండి మరియు మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి #onelove #begrateful #helponeanother”
"నేను పరమహంస యోగానందగారిని రెండు సందర్భాలలో కలిశాను....నేను ఆ పుస్తకాన్ని. (ఒక యోగి ఆత్మకథ) చదవడం ప్రారంభించిన క్షణమే నేను వర్ణించలేనిదేదో చేసింది. నేను యోగముపై యోగులు రచించిన చాలా పుస్తకాలు చదివాను. కానీ ఈ పుస్తకం ఆకట్టుకున్నంతగా ఏదీ నన్ను ఆకట్టుకోలేదు.. ఇందులో ఏదో ఇంద్రజాలం ఉంది."
"నేను ఇంట్లో ఒక యోగి ఆత్మకథను కుప్పలుగా ఉంచుతాను మరియు నేను దానిని అందరికీ నిరంతరం అందిస్తాను. ప్రజలు మళ్ళీ గాడిలో పడదలచుకున్నప్పుడు, నేను దీన్ని చదవమని చెబుతాను, ఎందుకంటే ఇది ప్రతి మత అంతరంగమును ఛేదిస్తుంది."
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి
గడచిన 100 సంవత్సరాలుగా, సంస్థ వ్యవస్థాపకులు మరియు పశ్చిమంలో యోగపితామహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) అంకితభావంతో కొనసాగిస్తోంది.
భారతదేశంలో సహస్రాబ్దుల క్రితం ఉద్భవించిన పవిత్ర ఆధ్యాత్మిక సశాస్త్రీయమైన క్రియాయోగం యొక్క విశ్వజనీన బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ పరమహంస యోగానందగారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) సంస్థను స్థాపించారు. ఏ మతమునకు సంబంధం లేనటువంటి ఈ బోధనలు సర్వతోముఖ విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి సంపూర్ణ తత్త్వశాస్త్రం మరియు జీవన విధానాన్ని, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని — పరమాత్మతో జీవాత్మ యొక్క ఐక్యత సాధించడానికి ధ్యానం యొక్క పద్ధతులు కలిగి ఉంటాయి.
అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానంద ఇలా వివరిస్తారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగా అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను పొందవచ్చు. ఈ దివ్య సమ్మేళనానికి దారితీసే ఏ చర్యనైనా యోగం సూచిస్తుంది.”

















