“క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను,” అని చెప్పేవారాయన, తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా. “నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను.”
— ఒక యోగి ఆత్మకథ లో లాహిరీ మహాశయులు
యోగావతారులు లేదా “యోగం యొక్క అవతారం” గా గౌరవించబడే లాహిరీ మహాశయులు 160 సంవత్సరాల క్రితం హిమాలయాల్లో రాణీఖేత్ వద్ద అమర మహాగురువులు మహావతార్ బాబాజీని కలుసుకొని పవిత్ర విజ్ఞానమైన క్రియాయోగ దీక్షను స్వీకరించారు. ఈ దివ్య దీవెనను పరమహంస యోగానందగారు మొదటిసారిగా తమ ఒక యోగి ఆత్మకథ ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. అందులో ఆయన ఇలా అన్నారు, “ఈ శుభప్రదమైన సంఘటన జరిగినది లాహిరీ మహాశయులకు ఒక్కరికే కాదు; ఇది మొత్తం మానవాళి కంతటికీ ఒక సౌభాగ్యవంతమైన క్షణం. మరుగునపడిన లేదా చాలా కాలంగా కనుమరుగైన సర్వోన్నత యోగవిద్య వెలుగులోకి తీసుకురాబడింది.
ప్రపంచానికి పవిత్రమైన క్రియాయోగ బోధనలను అందించిన యోగావతారుల గౌరవార్థం, లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవంనాడు (జన్మదిన వార్షికోత్సవం) సెప్టెంబర్ 30న, ఒక ప్రత్యేక ఆన్లైన్ ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఒక ప్రారంభ ప్రార్థనతో మొదలై, తరువాత పఠనం, భక్తిగీతాలాపన, నియమిత సమయంపాటు ధ్యానం, ఆపై పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ఒక ముగింపు ప్రార్థనతో సమాప్తమయ్యింది.
ఈ ఆన్లైన్ ధ్యానంతో పాటు, ఈ సందర్భంలో వ్యక్తిగతంగా పాల్గొనే స్మారకోత్సవ కార్యక్రమాలను వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా నిర్వహించాయి.
ఈ శుభ సందర్భంలో విరాళం సమర్పించాలని మీరు భావిస్తే, మా వెబ్ సైట్ సందర్శించి క్రింద ఉన్న లింక్ ద్వారా సమర్పించవచ్చు. మీ సహకారం వివిధ మానవతా కార్యకలాపాలను చేపట్టేందుకు మాకు సహాయం చేయడమే కాకుండా, ఆ మహాగురువుల పట్ల మీ శాశ్వతమైన ప్రేమను మరియు మీ దృఢ భక్తిని చూపుతుంది.

















