శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం

స్మారక ఆన్‌లైన్ ధ్యానం

గురువారం, సెప్టెంబర్ 26, 2024

ఉదయం 6:30

– ఉదయం 8:00

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

దైవసాయుజ్యం స్వయంకృషి ద్వారా సాధ్యం, అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాలమీద కాని విశ్వనియంత నిరంకుశ సంకల్పం మీద కాని ఆధారపడి ఉన్నది కాదు.

— లాహిరీ మహాశయులు, ఒక యోగి ఆత్మకథ లో ఇలా ఉద్ఘాటించారు

ఆధునిక కాలంలో యోగా — పరమాత్మతో ఆత్మ యొక్క కలయిక — చారిత్రాత్మక పునరుజ్జీవనానికి శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు ఒక కీలకమైన వ్యక్తి. “యోగా యొక్క అవతారం” లేక ఒక యోగావతార్ గా గౌరవించబడతూ దైవశాస్త్రం యొక్క అత్యున్నత విజయాలకు దృష్టాంతంగా నిలిచారు.

సెప్టెంబర్ 26, 1895న లాహిరీ మహాశయులు మహాసమాధిలో ప్రవేశించారు, పరమాత్మతో ఏకత్వం పొందిన స్థితిలో, శరీరం నుండి దైవసాక్షాత్కారం పొందిన ఒక యోగి యొక్క సచేతన అంతిమ నిష్క్రమణ. లాహిరీ మహాశయుల గౌరవార్థం, వారి మహాసమాధి రోజున ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానాన్ని గురువారం, సెప్టెంబర్ 26న ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఒక ప్రారంభ ప్రార్థన, పఠనం, మరియు నియమిత సమయంపాటు భక్తిగీతాలాపన మరియు ధ్యానంతో కూడిన ఈ కార్యక్రమం పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ఒక ముగింపు ప్రార్థనతో ముగిసింది.

ఈ సందర్భంగా ఈ ఆన్‌లైన్ కార్యక్రమంతోపాటు, స్వయంగా పాల్గొనే వివిధ స్మారకోత్సవ కార్యక్రమాలను మా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించాయి.

ఈ సందర్భంగా మీరు సాంప్రదాయకమైన తోడ్పాటును అందించాలనుకుంటే, దయచేసి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీరు సమర్పించినందుకు మేము కృతజ్ఞులము, శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల అనుగ్రహం మరియు ఆశీస్సులకు మీ కృతజ్ఞతా చిహ్నంగా దీనిని స్వీకరిస్తాము.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి