చాలా మంది సంఘటనలు జరిగే క్రమం సహజమని, అనివార్యమని అనుకొంటారు. ప్రార్థన వల్ల సమూలమైన మార్పులు సాధ్యమని వాళ్ళు ఎరుగరు.
— పరమహంస యోగానంద
ఆన్లైన్ ప్రార్థన సమావేశాలను ప్రతి బుధవారంనాడు రాత్రి 9:00 (భారతీయ కాలమానం ప్రకారం) గంటలకు 20 నిమిషాలపాటు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. మొదటి సమావేశం మే 27న వై.ఎస్.ఎస్. సన్యాసిచే నిర్వహించబడుతుంది, ఆ తదుపరి సమావేశాలు (జూన్ 3 నుండి) వై.ఎస్.ఎస్. భక్తులచే నిర్వహించబడతాయి.
ప్రార్థనా సమావేశం ప్రారంభ ప్రార్థనతో మొదలై, ఆ తర్వాత స్ఫుర్తిదాయక పఠనం లేదా పరమహంస యోగానంద గారి దివ్యసంకల్పం మరియు కొద్దిసేపు ధ్యానంతో కూడి ఉంటుంది. అనంతరం, భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను ఉన్న ఇతరుల కోసం, ప్రపంచ శాంతి కోసం, మరియు స్వస్థతా ప్రార్థనలు కోరిన వారి కోసం ప్రార్థించేందుకు మనమందరం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలితో కలుస్తాము. యోగానంద గారు బోధించిన స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది.
ఈ సమావేశాలలో పాల్గొనేందుకు అందరికీ స్వాగతం.
దయచేసి గమనించండి: ఈ ఆన్లైన్ ప్రార్థనా సమావేశాలు జూమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి యొక్క చిన్నపుస్తకం క్రింద ఇవ్వబడినది. దీనిని చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.
అవసరం ఉన్న ప్రతి ఒక్కరి కోసం అన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఉన్న సన్యాసులు గాఢంగా ప్రార్థించడం కొనసాగిస్తారని మేము మీకు హామీ ఇస్తున్నాం. మీ కోసం లేదా ఇతరుల కోసం, మేము ప్రార్థించాలని మీరు భావిస్తే, ఇక్కడ క్లిక్ చేయండి:

















