భగవంతుడి పట్ల ప్రేమ మరియు మానవాళికి సేవ అనే ఆదర్శాలు పరమహంస యోగానందగారి జీవితంలో సంపూర్ణంగా వ్యక్తమయ్యాయి. తూర్పు మరియు పశ్చిమ దేశాలను ఆధ్యాత్మికంగా ఏకం చేసేందుకు మరియు అందరి హృదయాల్లో దైవ తృష్ణను జాగృతం చేసేందుకే ఆయన భూమిపై అవతరించారు. తమ పద్ధతుల్లో ఆయన ఆచరణాత్మకంగా ఉండేవారు; ఆయన బోధనలు మరియు జీవితం నిజమైన దైవభక్తుని జ్ఞానానికి ప్రతిబింబాలు. “ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు” అనే సూత్రాన్ని ఆయన ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లారు; శాశ్వతానందాన్ని పొందేందుకు పరమాత్మతో సచేతన ఆత్మ సంసర్గం యొక్క అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
— Paramahansa Yogananda: In Memoriam నుండి సంగ్రహించబడింది
జనవరి 5వ తేదీన జరుపుకునే జన్మోత్సవం, మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి పవిత్ర జన్మదిన సందర్భాన్ని సూచిస్తుంది. 1893లో గోరఖ్పూర్లోని ఒక భక్తియుత బెంగాలీ కుటుంబంలో ముకుంద లాల్ ఘోష్ గా జన్మించిన యోగానందగారు, భారతదేశంలో కొన్ని యుగాల క్రితం ఉద్భవించిన పవిత్ర ఆధ్యాత్మిక శాస్త్రమైన క్రియాయోగం యొక్క సార్వజనీన బోధనలను భారతదేశంలోను మరియు పొరుగున ఉన్న దేశాలలోను అందించేందుకు 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను స్థాపించడంతో తన జీవిత కార్యాన్ని ప్రారంభించారు.
మన ప్రియతమ గురుదేవులు పరమహంస యోగానందగారు అందించిన జీవన-పరివర్తనకారక క్రియాయోగ బోధనలకు కృతజ్ఞతగా, వారి జన్మోత్సవాన్ని ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమాలతో జరుపుకుంటున్నాం. ఈ పవిత్ర దినోత్సవాన మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో ఈ కార్యక్రమాలలో పాల్గొనమని, మరియు ఇతర సత్యాన్వేషకులతో కలిసి ధ్యానం చేయడం వల్ల లభించే ప్రత్యేక ఆశీస్సులను పొందవలసినదిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
జన్మోత్సవ ఆరు-గంటల ధ్యానం
ఆదివారం, జనవరి 4, 2026
ఉదయం 9:40 – మధ్యాహ్నం 4:00 (భారతీయ కాలమానం) వరకు
ఒక ప్రత్యేక స్మారకోత్సవ ఆరు-గంటల ధ్యానం ఆదివారం, జనవరి 4న వై.ఎస్.ఎస్. సన్యాసులచే నిర్వహించబడుతుంది. ఆధ్యాత్మికోన్నతి కలిగించే ఈ కార్యక్రమంలో నియమిత సమయంపాటు కీర్తన గానం, స్ఫూర్తిదాయక పఠనాలు, మరియు ధ్యానం కూడి ఉంటాయి. ఇది వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం శుక్రవారం, జనవరి 16, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
జన్మోత్సవ స్మారక ధ్యానం మరియు ప్రసంగం
సోమవారం, జనవరి 5, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:30 (భారతీయ కాలమానం) వరకు
ఈ కార్యక్రమంలో నియమిత సమయంపాటు కీర్తన గానం, మరియు ధ్యానం, ఆ తరువాత సద్గురువు యొక్క మార్గదర్శకత్వం ద్వారా లభించే ఆధ్యాత్మిక ఆశీస్సుల గురించి మరియు వారి ఆత్మ-విముక్తి బోధనల గురించి ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ఆంగ్లంలో నిర్వహించబడుతుంది.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం శుక్రవారం, జనవరి 16, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా, వ్యక్తిగతంగా పాల్గొనే స్మారకోత్సవ కార్యక్రమాలను గౌరవంతో, భక్తితో వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా నిర్వహిస్తాయి. మీకు దగ్గరలోని వై.ఎస్.ఎస్. ప్రాంతమును సంప్రదించి ఈ కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
భారతదేశానికి మరియు ప్రపంచానికి క్రియాయోగం యొక్క జీవిత-పరివర్తనకారక బోధనలను అందించిన మన ప్రియతమ పరమహంసగారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసే ప్రత్యేకమైన అవకాశాన్ని ఈ పవిత్రమైన రోజు గురుదేవుల భక్తులకు అందిస్తుంది.
మీరు ప్రణామి సమర్పించాలనుకుంటే, క్రింద ఉన్న లింక్ ద్వారా సమర్పించవచ్చు.

















