మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతిదీ మెరుగవుతుంది.
— స్వామి శ్రీయుక్తేశ్వర్
“జ్ఞానం యొక్క అవతారం” లేక “జ్ఞానావతారులు” గా గౌరవించబడే స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ మార్గంలోని భక్తులకు పరమగురువులు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి పుణ్యప్రదమైన మహాసమాధి సందర్భంగా, ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఒక ప్రత్యేక ఆన్లైన్ స్మారకోత్సవ ధ్యానాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూర్చే ఈ కార్యక్రమం ఆదివారం, మార్చి 9న నిర్వహించబడింది. ఇందులో భక్తిగానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం కూడి ఉన్నాయి.
ఈ సందర్భంగా వ్యక్తిగతంగా పాల్గొనే స్మారకోత్సవ కార్యక్రమాలను వివిధ ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించాయి.
వీటిని అన్వేషించడానికి మీరు ఇష్టపడవచ్చు:
ఈ ప్రత్యేక సందర్భంలో, గురు-ప్రణామి లేక విరాళం మీరు సమర్పించాలనుకుంటే, ఆన్లైన్ ద్వారా చేయడానికి మీకు స్వాగతం. మీ ఉదారమైన తోడ్పాటు మీపై అపారమైన ఆశీస్సులు కురిపించడమేగాక, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల క్రియాయోగ బోధనల వ్యాప్తికి సహాయకారిగా ఉంటుంది.